గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు

4. బైబిలు మహిమ



బైబిలు మహిమయను దీనికి బైబిలు, సంఘ చరిత్ర, లోక చరిత్ర, నా వృద్ధానుభవము ఆధారము.


I. బిబ్లాస్ :- లోకములోని గ్రంథములన్నిటిలో గొప్ప గ్రంథమని అర్ధమిచ్చు “బిబ్లాస్” అను గ్రీకు పదమునుండి “బైబిలు” అను పేరు వచ్చినది. "బైబిలు" అను పేరులోనే ఆ అర్ధము తెలియుచున్నది.


(ఎ) దైవాత్మ: దైవాత్మ ప్రేరేపణ వలన వ్రాయబడిన గ్రంథము.

II. (i) మొదటి ముద్రితము:- ముద్రాక్షరశాలలో మొట్టమొదట అచ్చువేయబడినది బైబిలు (జర్మనీభాషలో 16వ శతాబ్ధమున అచ్చువేయబడెను)


(ii) అక్షరముల లెక్క:- బైబిలులోని అక్షరములన్నియు లెక్కపెట్టబడినవి. ఒక్క అక్షరము తీసివేయుటకు వీలులేదు. కలుపుటకు వీలులేదు పొల్లుకూడ తీసివేయుటకు వీలులేదు. మత్తయి. 5:18.


(iii) వ్యాఖ్యానము:- మానవునియొక్క ఆయుష్కాలమునకు మించిపోయే వ్యాఖ్యాన గ్రంథములు బైబిలునకు మాత్రమే కలవు. డాక్టరు మార్టిన్ లూథరుగారు వ్రాసినది తిరిగి వ్రాయుటకు ఒకని ఆయుష్కాలము చాలదు. యోహాను 21:25.


(iv) అందరి గ్రంథము:- బైబిలు ఇప్పటికి 20 వందల భాషలలో అచ్చువేయబడినది. లోకమంతా చదివే పుస్తకము బైబిలు ఒక్కటే. మిషనెరీలు అక్షరములులేని భాషలకు అక్షరములు కల్పించి బైబిలు వ్రాసి అచ్చువెసిరి.


(v) ఆదరణ:- ఇతర పుస్తకములు చదువుట వలన కలిగిన ఆదరణకంటే బైబిలు చదివినందువలన ఎక్కువ ఆదరణ కలిగినదని బైబిలు చదువరులు సాక్ష్యమిచ్చుచున్నారు.


(vi) సుందరసింగు:- సాధు సుందరసింగుగారు ఇతర మత గ్రంథములలో మంచి సంగతులు ఉన్నవిగాని క్రీస్తులేడు అన్నారు. బైబిలులోని అన్ని పుస్తకములలో క్రీస్తు ఉన్నాడు.


(vii) రాళ్ళపై బైబిలు చరిత్ర:- బైబిలు చరిత్ర జరిగిన కాలమందు అన్ని దేశములలో దేవుని విశ్వాసులు పరవాసముచేసిరి. అప్పుడు ఆ దేశములోని అన్యరాజులు తమ రాజ్యచరిత్రతోపాటు విశ్వాసుల చరిత్ర రాళ్ళమీద చెక్కించిరి. వాటిమీద బైబిలు చరిత్ర ఉన్నది. (లూకా. 19:40) ప్రభువు చెప్పినది నెరవేరుచున్నది.


(viii) బైబిలు సారము:- బైబిలు దైవగ్రంథము, బైబిలు కథల పుస్తకము, బైబిలు చరిత్ర పుస్తకము. బైబిలు నీతి పాఠముల పుస్తకము.


బైబిలు అన్ని ప్రార్ధనలయొక్క జవాబుల పుస్తకము. బైబిలులో 66 పుస్తకములలోను బహిరంగముగానైతేనేమి, అంతరంగముగానైతేనేమి ఆయననుగూర్చి వ్రాయబడియున్నది. ఆయనే క్రీస్తు.


(ix) బ్లాక్ :- ఇకమీదట అచ్చు అవసరము లేకుండా బైబిలు అంతా బ్లాక్ క్రింద తయారు చేయుటకు ప్రయత్నము జరుగుచున్నది.


(x) ప్రభువు స్వరము:- యేసుప్రభువు శరీరధారిగా నున్నప్పుడు మాటలాడిన మాటలు ప్రసంగములు ఆయన స్వరముతో తీసి లోకమునకు ప్రకటనచేయుటకు ప్రయత్నించుచున్నారు.


(xi) అక్షర విలువ:- ఆదికాండము మొదటి అధ్యాయము మొదలు మలాకీ వరకు హెబ్రీభాషలోని అక్షరాలు లెక్కపెట్టి 7చేత భాగించిన శేషము మిగలదు. హెబ్రీ భాషలోని వర్ణమాలలోని అక్షరములకు అంకెలు గలవు. అక్షరములకు విలువ అంకెకూడా కలదు. ఆ లెక్కనుబట్టి 7 చేత భాగించి చూచిన శేషము మిగలదు. క్రొత్త నిబంధన గ్రీకు భాషలోకూడ ఇదే పద్ధతి కనుగొనవచ్చును. బైబిలు అంతటిలో ఉన్న ప్రతి వాక్యమునకు. పేరాకు ఇదే పద్ధతి కనుగొనవచ్చును. తర్జుమ భాషలోని ఈ లెక్క సరిపడదు. ఎవరైన ఒకరు ఎక్కడైన ఒక అక్షరము బైబిలులోనుండి తీసివేసిన ఇది ఎవరో చేసిన మోసమని గ్రహింపవచ్చును. ఒక్క సున్న అయినను లేక పొల్లు అయినను పోదు అను ప్రభువు మాట జ్ఞాపకము వచ్చుచున్నది. లోకములో ఎవరును ఈలాటి లెక్కలుగల పుస్తకము వ్రాయవీలులేదు.


(xii) వ్రాత:- 40 మంది గ్రంథకర్తలు 16 వందల సం॥లు ఈ గ్రంథమును వ్రాసిరి. ఈ గ్రంథమును వ్రాసినందుకు అనేకులు హతులైరి. ద్వితీయోపదేశకాండము భూగర్భములో తర్జుమాచేసిరి. కొన్ని గ్రంథములు గోడలలో దాచియుంచిరి. ఒకరు వ్రాయుచున్నట్లు మరియొకరికి తెలియకపోయిన అన్ని గ్రంథములు ఒకే భాషలో వ్రాయబడకపోయిన ఈ గ్రంథములన్నింటిని వరిశుద్ధాత్మ వ్రాయించుటచే ఒకదానికొకటి సంబంధము కలిగి ఒకే గ్రంథమైనది. అసలు గ్రంథకర్త దేవుడు. (నిర్గమ. 31:16) ఈ గ్రంథము కాపీ తీయునపుడు స్నానముచేసి క్రొత్తబట్టలు వేసుకొని వ్రాసెను. యెహోవా నామము వచ్చినపుడు క్రొత్తపాళీ వాడేవారు.


(xiii) అన్వయ పదములు:- ఒక అంశమునుగూర్చి ఎక్కడెక్కడ అన్వయ వాక్యములున్నవో ఒక గ్రంథము వ్రాసిరి ఒకమాట వంటి మాట ఎక్కడ ఉన్నదో వ్రాసిరి.


(xiv)అపోక్రిప:- ఆదికాండము మొదలు మలాకీ వరకు రక్షణ సంబంధమైన సంగతులున్నవి (తొగరుదారము) (యెహోషువ. 2:18) మలాకీ తరువాత వ్రాయబడిన 16 పుస్తకములలో (అప్రమాణిక గ్రంథములు) మంచి సంగతులున్నవి, గాని రక్షణ సంగతిలేదు గనుకనే బైబిలులో చేర్చలేదు. వాటికే అపోక్రిప గ్రంథములని పేరు.


(xv) టిన్ సిన్ దార్పు :- ఈ దొరగారు బైబిలు ప్రతులు వెదకుటకు లోకమంతా తిరిగెను. ఆయన సీనాయికొండ ఎక్కి బైరాగి మఠము వద్దనున్న బూడిదలో మార్కు సువార్తలో ఒకపుట దొరకగా బంగారమువలె పట్టుకొనిపోయెను (1845).


(xvi) సంచారము:- బైబిలులోని చరిత్ర జరిగినది, లేనిది తెలుసుకొనుటకు భక్తులు దేశ సంచారము చేసి వ్రాసిరి.


(xvii) పటములు:- బైబిలు చరిత్ర జరిగిన అన్ని దేశ పటములు తయారుచేసిరి.


(xviii) సవరణ:- బైబిలును సరిచేయుటకు 300 కాపీలు ప్రోగుచేసి సరిచేసుకొనిరి. కొన్ని ప్రతులలో కొన్ని మాటలు లేనప్పుడు ఈ ప్రతులలో ఈ మాటలు లేవని వ్రాసిరి.


(xix) హింస:- గ్రంథములలో హింసింపబడినది బైబిలు ఒక్కటే. మోషే దైవసన్నిధినుండి రాతిపలకలు తీసికొనివచ్చిన వెంటనే పగుల గొట్టుటకు సాతాను ప్రజలను ప్రేరేపించెను (నిర్గమ. 32:19).


(xx) ప్రతులు:- పరిశుద్ధ గ్రంథము అన్ని భాషలలో అచ్చువేయుటలోను ఎక్కువ ప్రతులు వేయుటలోను అమ్ముటలోను బైబిలే ఎక్కువ.


(xxi) సర్వవ్యాపకత్వము:- దేవుడు సర్వవ్యాపి గనుక బైబిలునకు కూడ సర్వవ్యాపకత్వము వచ్చినది. ఎట్లనగా బైబిలు అన్ని దేశముల లోనికి, అన్ని భాషలలోనికి, అన్ని మతములలోనికి, అన్ని జనాంగములలోనికి అన్నికాలములలోనికి ప్రవేశించుచున్నది. లోకాంతమువరకును వెళ్ళునట్టి ధోరణి కలిగియున్నది. బైబిలులోని ముఖ్య కధానాయకుడగు క్రీస్తు మోక్షములో నుండును. గనుక బైబిలు విషయముల ప్రమేయము కూడ ఆయనతో నుండును. గనుక బైబిలు అనంతకాలమువరకు వెళ్ళుచునేయుండును.


(xxii) గ్రుడ్డివారిచూపు:-


(xxiii) పరిశుద్ధ గ్రంథము:-

సీ॥ బైబిలులోనున్న - పరిశుద్ధ కథలెల్ల
ఎత్తి ప్రార్థించిన - ఉత్తమంబు
బైబిలులో నున్న - వాగ్ధానములనెల్ల -
ఎత్తి ప్రార్థించిన - ఉత్తమంబు
సభ కథలందున్న ఆ సవ్య విషయములు -
ఎత్తి ప్రార్ధించిన - ఉత్తమంబు
నీ యనుభవములో - నీ ప్రార్ధనోత్తర -
లెత్తి ప్రార్ధించిన - ఉత్తమంబు.


తే॥ గీ॥ గ్రంథ వృత్తాంతములును వా - గ్ధానములును
సంఘ వృత్తాంతములును నీ - స్వానుభవము
చేరి నిను బలపరచి నీ - చేత లెక్క లేని
పనులు చేయించును - లెమ్ము లెమ్ము,