గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు
6. సంఘ మహిమ
- 1. జనసంఖ్య:- అన్ని మతముల జనసంఖ్యకంటే క్రైస్తవమత జనసంఖ్యయే ఎక్కువ. క్రైస్తవ మతములోనికి రాకపోయినను ఆ మత పక్షము వహించిన అభిమానుల సంఖ్యకూడ ఎక్కువగానేయున్నది.
- 2. బైబిలు:- దైవగ్రంథమగు బైబిలును 2000 పైగా భాషలలో అచ్చువేసిరి.
- 3. ప్రచురణ:- పరీక్షార్థమై యితర మత గ్రంథములు ప్రచురించుటలో వ్యాఖ్యానములు, ఇతర గ్రంథములు, పత్రికాదులు ప్రచురించుటలో ఎక్కువ. లిపిలేని భాషలకు లిపి కల్పించుచున్నారు.
- 4. మతబోధకులను సిద్ధపరచుట:- అన్ని దేశములలో అన్ని భాషలలో క్రైస్తవమత బోధకులను సిద్ధపరచుచున్నారు.
- 5. మత ప్రకటన:- పనివారిని అన్నిదేశములకు మత ప్రకటన నిమిత్తమై పంపుట. జీతముల పద్ధతిని, స్త్రీలను, పురుషులను పని వారినిగా ఏర్పరచుట జీతములు లేకుండా విశ్వాసపద్ధతిపై పనివారిని ఏర్పరచుట.
- 6. దేవాలయములు:- ఇతర మత దేవాలయముల కన్నా క్రైస్తవ మత దేవాలయములు సంఖ్యలోను, విలువలోను ఎక్కువ.
- 7. ధనము:- మతము నిమిత్తమై దేవుని కిచ్చుటలో, మతము కొరకు ఖర్చు పెట్టుటలో ఎక్కువ.
- 8. పాఠశాలలు:- పాఠశాలలు స్థాపించి మతవిద్య, లౌకిక విద్య నేర్పుచున్నారు. గ్రుడ్డివారికి సహితము విద్య నేర్పుచున్నారు. మూగవారికి కూడ విద్య నేర్పుచున్నారు.
- 9. వైద్యశాలలు:- వైద్యశాలలు స్థాపించి, వైద్యము చేయుట వైద్య విద్య నేర్పుట, పశువులకు వైద్యశాలలు స్థాపించుట, అనాధ శాలలు స్థాపించి, చేతిపనులను నేర్పుచున్నారు.
- 10. ఆశ్రయ స్థానములు:- బీద విల్లలకు పోషణ విషయములోను, విద్యలోను, నాగరికత విషయములోను, పనిపాటలు నేర్పు విషయములో, దైవభక్తి నేర్పు విషయములోను ఉపకారము చేయుచున్నారు. భర్తపోయినవారికి పెండ్లి ఏర్చరచుచున్నారు.
- 11. దైవప్రార్థన:- అనుదినము కుటుంబములలోను, ఆదివారము దేవాలయములలోను, పండుగ సమయములలోను, మనుష్యులందరి క్షేమము నిమిత్తమై అన్ని సమయములందు ప్రార్థింతురు.
- 12. నరమాంస భక్షకులు:- నరమాంస భక్షకులను సహా మార్చుచున్నారు. అస్సాము దేశములోని నరమాంస భక్షకులు కొండమీదనున్న వారు కొందరు క్రైస్తవులై బెజవాడ, గుంటూరు వచ్చి క్రీస్తునుగూర్చి సాక్ష్యమిచ్చిరి (1956సం॥ము).
- 13. ఇతర మతములను పిలుచుట:- ఎక్కడకు వెళ్ళినా ప్రజలలో మాట్లాడుచు, క్రీస్తును అనుసరించుడనియు, ఆయనవలన పాప విముక్తి కలుగుననియు, మోక్షము దొరుకుననియు క్రీస్తు మతస్థులు బోధించుచు, అన్ని మతములవారిని, పిలుచుచు, అందరిని చేర్చుకొను చున్నారు.
- 14. ప్రపంచశాంతి:- లోకజనులందరికి సహోదర ప్రేమయందు ఐక్యపరచి ఒకటిగాచేయ ప్రయత్నము చేయుచున్నది.
- 15. దైవిక స్వస్థిశాల:- బోధవలన పాపులకు, రోగులకు, భూత పీడితులకు, బీదలకు సంతానములేని వారికి, చిక్కులలో ఉన్నవారికి, పశ్వాదులకు, ఉపకారము చేయు స్వస్థిశాలలు నియమించుచున్నారు. గుంటూరువద్ద నున్న కాకానిదగ్గర ప్రతి సోమవారము స్వస్థత కార్యక్రమము జరుగుచున్నది.
- 16. హతసాక్షులు:- క్రైస్తవ మతమును వదలిపెట్టవలెనని ఇతరులు పీడించినను, క్రైస్తవ మతమును వదలక వారిచేతిలో హతమగుటలో ఎక్కువ. క్రైస్తవ మతము హింసకాలమందు సంఖ్య వృద్ధియగుచున్నది. క్రైస్తవులను హింసించువారు మారుచున్నారు.
- 17. పండితులు:- వేదాంత పండితులు ఇతర శాస్త్ర పండితులు క్రైస్తవ మతమునందు ఎక్కువ గలరు. పరోపకార సాధనములు కల్పించు నేర్చరులుకూడ ఎక్కువ గలరు.
- 18. హెచ్చు స్థితి:- తక్కువజాతి వారిని క్రైస్తవ మతము ఎక్కువ స్థితిలోనికి తీసుకొని వచ్చినది.
- 19. దేవనరుడు:- దేవుడు నరవంశమునందు జన్మించునని బైబిలులో నున్నది. ఆయనేవచ్చి యేసుక్రీస్తు నామమును ధరించి సర్వలోక రక్షణార్ధమైన పనులు ముగించి వెళ్ళిపోయెను. క్రీస్తునుబట్టి మతము వృద్ధియగుచున్నది. ఆయన సంఘము మనకాలము వరకు వచ్చినది. (2000 సం॥ము).
- 20. నేడును దేవుడు కనబడి మాట్లాడుచున్నాడు:- 1938 సం॥ము జనవరిలో రాజమండ్రిలో దేవదాసు అయ్యగారికి "బైబిలు మిషను" అని గాలిలో ప్రభువు వ్రాసి చూపించెను. ఈ విధముగా - బైబిలు మిషనును దేవుడు బైలుపరచెను. నేడును అనేకులకు కనబడి మాట్లాడుచున్నాడు. పౌలు, సాధుసుందర సింగ్ , కైలాస మహర్షి, మొదలగు భక్తులకు ఈ అనుభవము కలదు. హిమాలయములలో అట్టి అనుభవముగల క్రైస్తవ బుషుల అనేకులున్నారు.
- 21. క్రైస్తవుల చారబడు గుణము:- చక్రవర్తులు, పండితులు, సామాన్యులు, విమర్శకులు, హంతకులు, మరణములు, హానికరమైన స్థలములు, ఇట్టి అడ్డములున్నను, వాటన్నిటిలో తోను చొరవు చేసుకొనుచు చౌరబడు క్రీస్తుమతము మన యిరువదియవ శతాబ్దము వరకు వచ్చినది.
- 22. రష్యాః- 1935 సం॥ము నాటికి రష్యా దేశములో పరిశుద్ధ గ్రంథము ఉండకూడదనియు, దేవాలయములు నాటకశాలలుగా మార్చవలెనను ఆజ్ఞ బయలుదేరినది. క్రైస్తవులకు స్వేచ్చలేదు. ఈ మధ్య నాస్తిక దేశమైన రష్యాలో అనేకమంది క్రైస్తవులు నిర్భయముగా గొప్ప సభ చేసికొన్నారు.
- 23. విశ్వాసుల క్రియలు:- యోహా. 14:12 నాయందు విశ్వాస ముంచువారు నాకంటె ఎక్కువ క్రియలు చేయుదురని క్రీస్తుప్రభువు చెప్పెను. మతబోధల పుస్తకములు వ్రాయుటలో, ప్రచురించుటలో అనేక భాషలలో ఉపన్యసించుటలో, వేలకొలది సంఘములు స్థాపించుటలో పాఠశాలలో, ఆశయ స్థానములలో, వైద్యశాలలు నిర్మించుటలో కోటాను కోట్లమందిని క్రీస్తుతట్టు త్రిప్పుటలో ప్రభువు కొన్ని చేసెను గాని ప్రభువు సహాయముతో సంఘము ఎక్కువ చేయుచున్నది.
- 24. క్రైస్తవ దేశములు:- మన కాలములో క్రైస్తవ దేశములు అనేక లోకోపకారములు చేయుచున్నవి. ముద్రాక్షరశాలలు, గ్యాస్ పైట్లు, ఎలక్ట్రిక్ లైట్లు, ట్రైన్లు, కార్లు, బైసికిళ్లు, ఓడలు, స్టీమర్లు, దుర్భిణీలు, టెలిగ్రాములు, టెలివిజన్లు, గ్రామఫోనులు, బ్రాడ్ కాస్టులు కండ్ల అద్దములు, ఎక్సరేలు, కలములు, మందులు, మరలు, గడియారములు, ఫోటోగ్రాపులు, విమానములు మొ॥వి ఇవి పూర్వమందే యున్నవని మెరిగిన వారున్న యెడల అవి ఇప్పుడు లేవుకదా? ఇప్పుడున్నవే వాడుకొనుచున్నాము.
- 25. NMS:- నేషనల్ మిషనెరీ సొసైటీ ఇది ఇండియాలో నువార్తలేని స్థలములలో నువార్త వినివించుటకు పని జరిగించుచున్నది.
పద్యములు:-
సీ॥అన్నవస్త్రాదులు - ఆశ్రయస్థానాలు
ఏర్పాటుచేసిన - దే మతంబు
మనుజులన్ భక్షించు - మనుజులన్ మార్చుట
కేర్పాటు చేసిన - దే మతంబు
దేశదేశాలలో - దేవవాక్యము చాట
నేర్పాటుచేసిన - దే మతంబు
విద్యనాగరికత - వివిధవృత్తులు నేర్ప
నేర్పాటుచేసిన - దే మతంబు
తే॥గీ॥ అంటు మాప ప్రయత్నించె వై - ద్యంబుచేయు
సాలలనుబెట్టె బైబిలు - సర్వభాష
లకును మార్చె క్రైస్తవ మత - మొకటె యిట్టి
మంచిపని చేయునది దైవ - మతముగాదె
సీ॥ కులభేదమెంచక - కులములన్నిటిలోని
మనుజులన్ దరిచేర్చు - మతమదేది
పరమతస్తుల బిల్చి - పరమతంబిదే
మళ్ళుడంచునుజెప్పు - మతమదేది
క్రైస్తవేతర మత - గ్రంథముల్ ప్రచురించి
మతపరీక్షకు బెట్టు - మతమదేది
క్రైస్తవులకు లోట్లు - కలిగినన్ క్రీస్తుని
మహిమ వెల్లడిచేయు - మతమదేది
తే॥గీ॥ ఆదివారమారాధన - ఆచరించు
వ్రతము కల్గివాక్యము విను - మతమదేది
అన్ని దేశాలకై వచ్చి - యున్నమతము
మహినిచుట్టిన క్రైస్తవ - మతముకాదే.